పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాల్లో రోడ్లు బాగుచేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని TRS MLA దాసరి మనోహర్ రెడ్డిని స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఎన్నో సార్లు రోడ్డు రిపేర్ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొదురుపాకలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్లు బాగు చేసేవరకు వెళ్లనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కారు ముందు స్థానికులు బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే దాసరి అక్కడకు రావడంతో స్థానికులు ఆయనను అడ్డుకొని నిరసన తెలిపారు.